Posts

Showing posts from June, 2020

2019

Image
2019ఫిబ్రవరిలో నేను రాసి ప్రచురించిన 60 మట్టిపోగు పుస్తకాలను అనంతపురం కేంద్ర గ్రంథాలయం లో ఇచ్చా.  2019మార్చిలో కదిరి అభివృద్ధి వేదిక ను ఏర్పాటు చేశా.ఎన్నికల సందర్భంగా పోటీ అభ్యర్థులతో కదిరి అభివృద్ధి కోసం వారేం చేస్తారో చెప్పాలని కోరాం. 2019ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశాను అంబేద్కర్ జయంతి సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో  అంబేద్కర్ జయంతిని    నిర్వహించారు. ఈ సందర్భంగా  కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమార్ స్వామి రెడ్డి మాట్లాడుతూ  అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పైకి ఎదిగాడని దళితుల సమస్యల పైన పోరాడుతూ సమాజంలో ఉన్న కులవివక్షను పోగొట్టడానికి అసమానతలను పోగొట్టడానికి అనేక పోరాటాలు చేశాడ న్నారు .రాజ్యాంగ నిర్మాతగా లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామిక  ప్రభుత్వాన్ని ఆయన అభిలషించారు. కదిరి అభివృద్ధి వేదిక ను అంబేద్కర్ జయంతి తేదీని ని ప్రారంభ దినంగా తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వేదిక మరో కన్వీనర్ జెవిరమణ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ ,ఎన్జీవో నాయకులు ఆత్మ రెడ్డి , లాయర్ చౌడప్ప, రైతు సంఘం నాయకులు సుబ్బ...

2018 లో సాహిత్య కార్యక్రమాల దృశ్యమాలిక

Image
A Report on Literary Program on "life of Handicrafts in Telugu Literature" conducted at Hindupuram on 27-01-2018.        Sahithya Academy, Banglore and Sahiti Sravanti, Hindupuram jointly conducted a Literary Program on "Life of Handicrafts in Telugu Literature" on 27-01-2018 at Balaji DEd College, Hindupuram.        The inaugural session was presided over by Sri Pilla Kumaraswamy. Sahiti Sravanti State Committee Member. He told that the life of Handicrafts is depicted in Various angles right from the olden Puranas to latest short stories. In Telugu Stories there are numerable stories pertaining to Bahujanulu. In the globalization era handicrafts lost their importance by the advancement of machanisation. "Palle Kanneeru Peduthunnado Kanipinchani Kutrala" is the latest song on handicrafts which are being devastated by the introduction of machines and the policies of the government. Chief Guest Sri Sadlapalli Chid...

డిమాండ్

తెలుగు భాషా సంఘం ను పునరుద్ధరణ చేయాలి.దానికి జిల్లా స్తాయి సంఘాన్ని పునరుద్ధరించాలి.కలెక్టర్ ఈపని చేయాలి.  తెలుగు విశ్వవిద్యాలయాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలి.రచయితలు తమ రచనలను ప్రచురిచుకోవడానికి ఈ విశ్వవిద్యాలయం సహాయం చేయాలి. ఎల్ కె జి నుండి ఇంటర్ వరకు అన్ని పాఠశాలలో  (కార్పొరేట్ లో కూడా) తెలుగు ను తప్పనిసరి చేయాలి.  తెలుగు భాషాభివృద్దికి పాటు పడే సంస్థలను గుర్తించి వాటికి సహాయ సహకారాలందించాలి.

2017లో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల దృశ్యమాలిక

Image
ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  అనంత సాహితీ సమాలోచన పుస్తకాన్ని ప్రచురించాము. ఏప్రిల్‌లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు ను నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.పార్టీ సహకారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరిగేది కాదు.దీని కోసం  5 లక్షలు సేకరిస్తే దాదాపు 3.60  వరకు ఖర్చు అయింది. వేమన సాహిత్యాన్ని ప్రజల్లోకి             సమాజ హితాన్ని కోరి సాహిత్యాన్ని రచించిన ప్రజా కవి వేమన సాహిత్యాన్ని ప్రజల్లో కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుందని వేమన ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.  ఆదివారం నాడు లలితకళాపరిషత్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన వేమన సాహితీసమాలోచన రాష్ట్ర సదస్సు చారిత్రాత్మక సాహిత్య సదస్సుగా నిలిచిందన్నారు. దాదాపు రెండు వందల యాభై సంఘాలు,ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు, సామాజిక వేత్తల ప్రత్యేక్ష, పరోక్ష సహాయ సహకారాలతో వేమన సదస్సు విజయవంతం అయ్యిందన్నారు. వేమన రూపక...

కరువుపై కరువులు, రచయితలు స్పందించాలి(5/4/2015)

Image
సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ "వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రైతు ఆత్మహత్యలు, ఉపాధి కోసం వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై కరువులు, రచయితలు స్పందించాల్సిన అవసరముంది'. అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కుమారస్వామి ఆధ్యక్షతన ఆదివారం నాడు "ప్రజాశక్తి కార్యాలయం లో సాహితీ సమయం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ.రాంభూపాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయిప్రసంగించారు.          ‌వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం అస్థవ్యస్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు సాగునీరు, తాగునీటి వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఇటువంటి సమయంలో కవులు, రచయితలు జిల్లా పరిస్థితుల పై తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. తేమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ప్రభుత్వాల తీరును ఎండగట్టే విధంగా ఉ...

2016

Image
2016   రాష్ట్రం లోనే ప్రధమంగా కవులు రచయిత ల ఫొటోలతో ఒక కేలండర్ ను ఆర్ట్స్ కళాశాల లో ఆవిష్కరించాము. అటు తర్వాత ఆర్ట్స్ కళాశాల లో జిల్లాలోని దివంగత సాహిత్య కారుల పై ప్రతి నెలా 3వ ఆదివారం సాహితీ సమాలోచన పేరుతో వేమన రాళ్ళపల్లి గుత్తి రామక్రిష్న తలమర్ల కళానిధి బెల్లూరు శ్రీనివాస మూర్తి సర్దేశాయి తిరుమలరావు విద్వాన్ విశ్వం కోగిర జై సీతారాం(కవికాకి) లపై ప్రసంగ సమావేశం నిర్వహించాం.            సాహిత్య అకాడమీ తో కలిసి కార్మికసాహిత్యం పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించాము. కదిరి లో ఇపుడు వీస్తున్న గాలి పేరుతో నెల నెలా జిల్లాలోని కవుల రచన లపై సమీక్షా సమవేశాలు నిర్వహించాము.జూపల్లి ప్రేంచంద్ అవేద, రమేష్ నారాయణ గిరిజన సంస్క్రుతులు, సడ్లపల్లి దృశ్యప్రవాహం, వైసిపి వెంకట్ రెడ్ది సినిమావైరాగ్యం  పై సమీక్ష నిర్వహించాము.          జిల్లాస్థాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశాము. Goals [x] Become an eagle by march 2016 [x] write a book on sastreeya alochana...

సాహిత్యం కోసం చేసిన కృషి

గత 18 సంవత్సరాలుగా తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి నిర్వహించాను .గురజాడ జయంతి ,జాషువా శ్రీ శ్రీ  వర్ధం తులు క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాను. సాహితీ స్రవంతి సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ,అధ్యక్షునిగా ,జిల్లా గౌరవ అధ్యక్షులు గా ఉండి జిల్లా  సాహిత్య సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి కి కృషి చేశాను. ప్రపంచీకరణలో తెలుగు భాష ఉన్నత మధ్య తరగతి వర్గం లో కనుమరుగవుతోందన్న యునెస్కో నివేదికను గుర్తించిన తర్వాత తెలుగు భాష పరిరక్షణ అవసరమని భావించి తెలుగు భాషా పండితుల కోసం  కవిత్వం కథ వ్యాసరచన పోటీలు నిర్వహించి వారిలో సాహిత్యాభిలాష తెలుగు భాషాభివృద్ధిలో  వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కృషి చేశాను. అదే విధంగానే విద్యార్థులకోసం అనేక కథ కవిత్వం వ్యాసరచన సాహిత్య పోటీలు పెట్టి బహుమతులు అందించాను.ఇలాంటి కృషి  ఫలితం గా ఈరోజు జిల్లాలో  సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్ధత బ్రద్దలై అనేక సాహిత్య సంఘాలు ఏర్పడి భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అదే సందర్భంలోనే చాలా మంది కొత్త కవులు రచయితలు వెలుగులోకి వచ్చారు. ఇంకా  చాలామంద...

పుస్తకావిష్కరణలు

లెనిన్ జీవిత కథనం 2019,ఆగష్టు లో నేను రాసి ప్రచురించిన లెనిన్ జీవిత కథనం పుస్తకం అనంతపురంలోని ప్రెస్ క్లబ్బులో ఆవిష్కరించబడింది.గమనం ఆధ్వర్యంలో. శుక సప్తతి 2019సెప్టెంబర్లో నేను రాసి ప్రచురించిన శుక సప్తతి కథలు పుస్తకాన్ని కదిరి కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరింపజేశాను.

Events

2019ఫిబ్రవరిలో నేను రాసి ప్రచురించిన 60 మట్టిపోగు పుస్తకాలను అనంతపురం కేంద్ర గ్రంథాలయం లో ఇచ్చా.  2019మార్చిలో కదిరి అభివృద్ధి వేదిక ను ఏర్పాటు చేశా.ఎన్నికల సందర్భంగా పోటీ అభ్యర్థులతో కదిరి అభివృద్ధి కోసం వారేం చేస్తారో చెప్పాలని కోరాం. 2019ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశాను అంబేద్కర్ జయంతి సందర్భంగా కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో  అంబేద్కర్ జయంతిని    నిర్వహించారు. ఈ సందర్భంగా  కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమార్ స్వామి రెడ్డి మాట్లాడుతూ  అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పైకి ఎదిగాడని దళితుల సమస్యల పైన పోరాడుతూ సమాజంలో ఉన్న కులవివక్షను పోగొట్టడానికి అసమానతలను పోగొట్టడానికి అనేక పోరాటాలు చేశాడ న్నారు .రాజ్యాంగ నిర్మాతగా లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామిక  ప్రభుత్వాన్ని ఆయన అభిలషించారు. కదిరి అభివృద్ధి వేదిక ను అంబేద్కర్ జయంతి తేదీని ని ప్రారంభ దినంగా తీర్మానం చేశారు. ఈ సమావేశానికి వేదిక మరో కన్వీనర్ జెవిరమణ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ ,ఎన్జీవో నాయకులు ఆత్మ రెడ్డి , లాయర్ చౌడప్ప, రైతు సంఘం నాయకులు సుబ్బ...