పిళ్లా కుమారస్వామి
సాహితీ యవనికపై నిత్యం కదలాడే పిళ్లా కుమారస్వామి వాస్తవానికి వృత్తి రీత్యా జీవిత భీమా సంస్థలో ఒక అభివృద్ధి అధికారి అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన వృత్తి రీత్యా ఆర్థికరంగంలో వున్నా ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగంలోకి తొంగి చూడటానికి కారణం ఆయన కుటుంబనే పద్యం కావచ్చు. ఆయన తండ్రిగారు కీ. శే.పిళ్లా లక్ష్మిరెడ్డి తెలుగు పండితులు. అన్నగారు, అక్కగారు కూడా తెలుగు పండితులే. బహుశా వీరి ప్రభావం వల్లనేమో వీరు కూడా తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించి ఉంటారు. పిళ్లా కుమారస్వామి 8.7.1964లో కడపజిల్లా రాజంపేటలోని సరస్వతీపురంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు పిళ్లా రామలక్ష్మి, పిళ్లా లక్ష్మిరెడ్డి. తన చిన్నతనంలోనే తల్లి దివంగతురాలైంది. ఆ తరువాత పదైదేళ్ళ ప్రాయంలో తండ్రి మరణించారు. దాంతో ఆయన తన అన్న పిల్లా దశరథరామిరెడ్డిగారి దగ్గరే వుండి చదువు సాగించారు. 1990లో కదిరిలో జీవిత బీమా సంస్థలో డెవలెప్ మెంట్ ఆఫీసరుగా కడప నుంచి వచ్చి చేరినారు. ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే మరొక వైపు తనకు ఆసక్తి కలిగించిన జనవ...