Posts

Showing posts from November, 2025
 అజంతా గుహలు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో జల్పగావ్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ఔరంగాబాద్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో, ఎల్లోరా నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.వీటిని క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి క్రీ.పూ 480 వరకు నాటి 30 రాతి గుహలుగా చెక్కబడిన బౌద్ధ స్మారక చిహ్నాలు .ఇవి గుబురుగా పైకి ఎగసిన వృక్షాల నడుమ గుర్రపు నాడా ఆకారంలో 250 అడుగుల ఎత్తుతో ఉన్న లోతైన లోయ పక్కన ఈ గుహలు ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు పశ్చిమ కనుమల మధ్య అడవిలో వెన్నెలగా ఉండిపోయిన ఈ గుహలను 1819లో యాదృచ్ఛికంగా పునరావిష్కృతమైనాయి.         ఈ గుహల్లోని మందిరాల్లోని శిల్పకళ , చిత్రకళ, వాస్తుశిల్పం ఈ మూడు అజంతాను ప్రపంచ ప్రఖ్యాతి పొందేలా చేశాయి.       బుద్ధుని జీవితంలోని ఘట్టాలు, జాతక కథలు అత్యంత సున్నితంగా శ్రద్ధతో చిత్రీకరించారు ఆనాటి చిత్రకారులు. మానవ జీవితంలోని నీతి, ధర్మ విలువలు అందులో వ్యక్తమవుతాయి.చిత్రాల్లోని ముఖాలలో ప్రేమ, కరుణ, విషాదం, శాంతి వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి.       ఈ గుహలను సందర్శించి...