Kcdf round table 7.2.26
కడప నగరంలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలి ___ KCDF రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల డిమాండ్ కడప నగరాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఆ వేదిక కన్వీనర్ పీ.వి. కుమారస్వామి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ కడప అభివృద్ధి వేదికకు కుమార స్వామి రెడ్డి కన్వీనర్ గా రామకృష్ణారెడ్డి కోకన్వీనర్ గా ఏర్పడిందన్నారు. కడప నగరంలో ఉన్న వివిధ సమస్యల పైన నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాల పైన చర్చించడానికి నగరంలో ఉన్న మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు స్వచ్ఛంద సంస్థలు ఇతర సామాజిక సేవా భావం కలిగిన వారందరినీ ఆహ్వానించామన్నారు. కడప నగరం ఏర్పడి 20 ఏళ్లకు పైగా అయినా ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని అన్నారు అభివృద్ధి అసలు ఊసే లేదని అన్నారు. నగరం చాలా విస్తరించినా పార్కులు రెండు మాత్రమే ఉన్నాయని, ఇంకా చాలా పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంచినీరు అరకొరగా వస్తుందని స్వచ్చమైన నీరు అన్ని ప్రాంతాల వారికి అందించాలని అన్నారు. ఇంకా ఇతర అంశాల పైన చర్చించడానికి వివిధ రంగ...