మానసిక వికాసం, అవయవ దానం పై సదస్సు
August 28, 2019, 1:14 PM
అవయవ దానం మహోన్నతమైనది
కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ ఎన్ ఎల్ డిగ్రీ కళాశాలలను మానసిక వికాసం, శరీర అవయవ దానం పై సదస్సు జరిగింది.ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన అభివృద్ధి వేదిక కన్వీనర్ పిళ్లా కుమార స్వామి రెడ్డి మాట్లాడుతూ మానసిక వికాసంలో పాత ఛాందస భావాలను వదులుకొని సరికొత్త ఆధునిక భావాలను అలవర్చుకుంటారని అందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కళాశాల ఉపాధ్యక్షులు ఆదిలక్ష్మి హాజరయ్యారు . అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈశ్వర లింగం మాట్లాడుతూ నేత్ర దానం అవయవ దానం రక్తదానం మనిషి ఇవ్వగల దానాలని అలా ఇవ్వడం ద్వారా ప్రపంచాన్ని విడిచి పోకుండా ఇక్కడే ఉన్నట్లు ఉంటుందని, ఇది గొప్ప మానవత్వానికి సంబంధించిన చర్య అని చెప్పారు. తర్వాత నేత్రదాన ప్రాముఖ్యతను వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన పి ఎస్ రాజు మాట్లాడుతూ ప్రజలు అనేక మూఢనమ్మకాలతో ఉన్నారని ఆ మూఢ నమ్మకాల నుంచి బయటపడి తోటి మానవులకు సహాయం చేయాల్సిన మానవీయ గుణాలను పెంపొందించుకోవాలని కోరారు. రక్త దానము కిడ్నీ దానం లివర్ దానము మనిషి తాను జీవించి ఉండగా ఇవ్వగల దానాలని ఆయన చెప్పారు . శరీరాన్ని మరణించిన తర్వాత ఆసుపత్రులకు ఇస్తే ఆ శరీరాన్ని పరీక్షించి విద్యార్థులకు అధ్యాపకులు బోధన చేస్తారని చెప్పారు . జీవితంలో, జీవితానంతరం మనం జీవించడానికి ,మనిషి మనిషిగా ఉండడానికి ఈ దానాలు చాలా ఉపకరిస్తాయని ఆయన చెప్పినారు .మానసిక వికాసం విద్యార్థులకు చాలా అవసరమని అది అనుభవం ద్వారా లేదా ఇతరులు చెప్పగావిని తెలుసుకొని జీవితంలో ఆచరించడం ద్వారా పురోభివృద్ధి సాధిస్తారని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో వేదిక కన్వీనర్ రమణ , తెలుగు అధ్యాపకులు సుందర మోహన్ రెడ్డి ,,ఇటుక ఇలియాస్ , ఎస్ ఎన్ జే ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment